`మహానటి`
చిత్రంలో సావిత్రిగా అద్భుత నటనతో మైమరిపించిన కీర్తి సురేష్ `జాతీయ
ఉత్తమ నటి`గా పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కీర్తిపై
పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కతర్ రాజధాని దోహ
లో జరిగిన `సైమా అవార్డుల` వేడుకలో ముఖ్య అతిధి మెగాస్టార్ చిరంజీవి
ఆశీస్సులు అందుకున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో సావిత్రిని తలపించేలా
సాంప్రదాయ చీరకట్టులో కీర్తి దర్శనమిచ్చారు. కీర్తి మెగాస్టార్
వద్దకు చేరుకుని ఎంతో వినమ్రంగా నవ్వులు చిందిస్తూ ముచ్చట్లాడారు.
మెగాస్టార్ సైతం చిరునవ్వులు చిందిస్తూ తనకు ఆశీస్సులు అందిస్తున్న ఆ
దృశ్యం కన్నులపండువగా కనిపిస్తోంది.